శ్రుతులూ స్మృతులే పోయినప్పుడిక వర్ణాలేమిటి? ఆశ్రమాలేమిటి? ఏదీలేదు. అంతా హుళక్కే
అయితే అంతా అధ్యాస మూలకమే అన్నందుకేమిటి దాఖలా? దీనికి దృష్టాంతమేదైనా ఉందా అని అడిగితే చెబుతున్నారు స్వామివారు. దృష్టాంతమనేది మనకు ప్రత్యక్షంగానే అనుభవానికి వస్తున్నది. అవే అహమ్, మమ అనే రెండు భావాలు, అహమంటే నేను. మమ అంటే నాది. నేనుకాని దానిని నేననుకోవడం ఒకటి. నాది కాని దానిని నాదనుకోటం మరొకటి. వీటినే అహంకార మమకారాలని పేర్కొంటారు వేదాంతులు. అనాత్మమీద ఆత్మ చైతన్య మధ్యస్తమయితే అది అహంకారం. దేహేంద్రియాత్మకమయిన ఈ సంఘాతమంతా వాస్తవానికనాత్మ. ఇది మన జ్ఞానానికెప్పుడూ విషయమవుతూ ఉంటుంది. విషయమవుతున్నదంటే అది నా స్వరూపం కాదనేగదా అర్థం. అలా స్వరూపం కాని దాన్ని నా స్వరూపమే, నేనేనని, నిత్యమూ భావిస్తున్నాము. ఇది అనాత్మ మీద జరిగిన ఆత్మా ధ్యాస. దీని మూలంగా అసలైన ఆత్మ ఏదో అది మరుగుపడిపోయింది. కేవలం తదాభాస రూపమయిన మరి ఒక నకిలీ ఆత్మ దాని స్థానంలో వచ్చి చేరింది. ఈ నకిలీ ఆత్మనే స్వరూపంగా భావించి మరలా దానిమీద బాహ్యమైన పుత్ర మిత్ర కళత్రాదులనూ, వస్తువాహనాదులనూ, చరాచర పదార్థాలన్నింటినీ తెచ్చి ఆరోపించు కొన్నాము. ఆత్మమీద జరిగిన అనాత్మాధ్యాసం ఇది. ఇదే మమకారం. దీని మూలంగా అంతకు ముందెక్కడా లేని ప్రపంచమొకటి పైకి వచ్చింది. మొదటిది సత్యాన్ని దాచిపెడితే రెండవది అసత్యాన్ని బయట పెట్టింది. మొత్తంమీద ఈ రెండు రకాలైన అధ్యాసవల్లనే మనకు రెండింతలుగా అనర్థం వచ్చి నెత్తిన పడింది. ఇది మనం నిత్యమూ అనుభవిస్తూనే ఉన్నాము. దేహవాసన అయితేనేమి? లోకవాసన అయితేనేమి? ఆ బాలగోపాలమందరికీ అనుభవసిద్ధమే. 'అహమ్ మమ' అనే భావాల అధ్యాసంవల్లనే ఇవి ఏర్పడ్డాయి. కాకపోతే ఇవి అనుభవానికెలా రాగలిగాయి? అంచేత అంతా అధ్యాస మూలకమే.
అలాగే అధ్యాస అనేదాన్ని వదిలేస్తే అంతా మటుమాయమవుతుందనేది కూడా మనకు ప్రత్యక్షమే. దేహేంద్రియాదులను నేను అనుకోకపోయినా,
Page 24