బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు పూజ్యులు, ప్రాతః స్మరణీయులు. వీరు శ్రీమతి సీతమ్మ, శ్రీ సుందరరావు దంపతులకు 1927వ సంవత్సరం జూన్ 15 వ తేదీ, ప్రభవ జ్యేష్ట శుద్ధ పూర్ణిమ బుధవారము ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించిరి. వీరి విద్యాభ్యాసము ఓంగోలు, గుంటూరు, వాల్తేరులలో జరిగింది. 1948 లో ఆంధ్ర విశ్వ విద్యాలయము నందు M.A నందు పట్టభద్రులైనారు.అనంతపురం నుండి శ్రీకాకుళము వరకు ఎన్నో ప్రభుత్వ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా, ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తూనే సాహిత్య-అద్వైత వేదాంతోపన్యాసనలు కొనసాగిస్తూ 1982 లో కడపలో పదవీ విరమణ గావించిరి.