నిర్వాణ దశకమ్
శ్లోకం 1
న భూమి ర తోయం న తేజో న వాయు
ర ఖం నేన్డ్రియం వా న తేషాం సమూహః ।
అనైకాన్తికత్వాత్ సుషుప్త్యేక సిద్ధ
స్తదేకో 2 వశిష్టః శివః కేవలో హమ్ ॥
నిర్వాణ దశకమనే ఈ స్తోత్రంలో ఇది మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో 'న' అనే మాటను మనం రెండు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు. న అంటే లేదనీ అర్ధమే కాదనీ అర్ధమే. ఇందులో మొదటి అర్ధం తీసుకొంటే ఈ భూమ్యాదులేవీ లేవు. ఉన్నదంతా ఒక్క శివతత్త్వమే. అదే నా స్వరూపమని భావం. రెండవ అర్ధం తీసుకొంటే నేనీ భూమ్యాకాశాదులేవీ కాను కేవలమా శివ స్వరూపుడనే అని భావం. మొత్తంమీద నిష్ప్రపంచమయిన బ్రహ్మమే నేననుకొన్నా సరే లేక నిష్ప్రపంచమయిన నేనే బ్రహ్మ స్వరూపమని భావించినా సరే. ఫలితం సర్వాత్మభావమే.
అందులో 'న భూమి:' అనే మాట మొదలుకొని, 'న ఖమ్' అనే మాటవరకూ పృథివ్యస్తేజోవాయ్వాకాశాలనే పంచభూతాలూ వర్ణించబడ్డాయి. ఈ అయిదూ లేవని చెప్పటం మూలాన పాంచభౌతికమయిన ప్రపంచమంతా నిరాకృతమయింది. పోతే 'నేంద్రియమ్ న తేషామ్ సమూహః' అనే మాటతో జరాయుజాది శరీరాలుకూడా నిషిద్ధమయిపోయాయి. మొత్తం మీద అటు బ్రహ్మాండమూ, ఇటు పిండాండమూ రెండింటినీ త్రోసి పుచ్చారాచార్యులవారు. దీనితో విషయ జగత్తంతా (Objective World) లేకుండా పోయింది.
అయితే ఈ లేదని నిషేధించటంలో సబబేమిటి అని ఇప్పుడు ప్రశ్న. అందుకోసమే మూడవ పాదంలో హేతువును పేర్కొంటున్నారు. అనైకాంతికత్వాత్తనేది హేతువచనం. ఐకాంతికమంటే ఎప్పుడూ ఒకే రూపంలో ఉండేది. ఐకాంతికం కానిదేదో అది అనైకాంతికం. అంటే ఎప్పటికప్పుడు రూపం మారిపోతుందని అర్ధం. ఈ కనిపించే బ్రహ్మాండంగానీ, పిండాండంగానీ ఎప్పటికీ ఒకే రూపంలో ఉండటంలేదు. ఎప్పటికప్పుడు మారిపోతున్నది. మారుతున్నట్టేమిటి దాఖలా అని అడగవచ్చు. >/p>
Page 16