#


Index

  ఎందుకంటే మూడూ దేనిపాటికది శూన్యమైనా ఆత్మరూపంగా మరలా సత్యమే. మూడూ కలిసి ఆత్మలోనే చేరిపోతాయి. కాబట్టి సర్వమూ ఆత్మే అయింది. అందుకే సర్వాత్మ భావమని దీనికి పట్టం కట్టారు పరమహంస పరివ్రాజకులు.

  ఈ సర్వాత్మ భావాన్నే మనమిప్పుడు శ్రవణ మననాదుల ద్వారా అంచెల వారీగా పట్టుకోవాలి. పట్టుకొంటే అది మన ఆత్మే Self కాబట్టి జగత్తైనా జీవుడైనా ఈశ్వరుడైనా ఏదైనా - నా స్వరూపమే నా అఖండ చైతన్యమే. అచైతన్య ప్రకాండమే. ఇలా త్రిశాఖత్మకమైనా సంసార వృక్షంగా భాసిస్తున్నదనే ఒక అఖండాను భవం Integrated Unified vision కలుగుతుంది. కలిగితే వాడే దక్షిణామూర్తి వాడే గురుమూర్తి వాడే జీవన్ముక్తుడు. అయితే జీవన్ముక్తుడే గాని ఇంకా విదేహ ముక్తుడు కాలేదు వాడు. ప్రారబావ సానంలో గాని అది లభించదు. అంతవరకూ జీవిత శేషముంటుంది. కాబట్టి అది ఊరక అన్న పానాదుల కంకితం చేయక లోకోద్ధరణకయి వినియోగించటం మంచిది. స్వయం తీర్ణః పరాంస్తారయతి అన్నారు. తానుత్తీర్ణుడై తన ఆశ్రితులను తరింపజేయాలి. ఆచార్యుడు 'ఆచార్యవాన్ పురుషోవేద’ అని శాస్త్రం లేకుంటే మిగతా లోకం తరించే మార్గం లేకుండా పోతుంది. లోకులంటే ఇక్కడ ఎవరంటే వారు కాదు. జిజ్ఞాసా ముముక్షలు రెండూ తీవ్రంగా ఉన్న సాధకులు. అలాంటి వారికి జ్ఞాన విజ్ఞానాలు రెండింటినీ తన ప్రవచనాలతో తన రచనలతో పంచిపెట్టాలి బ్రహ్మవేత్త. దీనికే సంకీర్తన మని పేరు. శ్రవణ మనన ధ్యానాలు మూడింటి తరువాత నాలుగవదిగా ఈ సంకీర్తన మనేది పేర్కొనట మిందుకే భాష్యకారులు.

Page 94