ఇలా శ్రవణ చేయటం మూలంగా సాధకుడి కున్న అజ్ఞానం ముందు నశిస్తుంది. ఏమిటా అజ్ఞానమంటే బ్రహ్మాండ పిండాండాలతో ముడిపడ్డ జేవేశ్వరులే గాక శుద్ధమైన పరిపూర్ణమైన చైతన్య మొకటి కార్య ప్రపంచానికతీతంగా ఉందని గుర్తించక పోవటమే అజ్ఞానం. అది ఇప్పుడు శ్రవణం వల్ల తొలగిపోయింది.
కాని అదీ ఇదీ అనే భేదమింకా తొలగిపోలేదు. ఆ చైతన్యానికి ఈ అచేతన జగత్తుకు ఏమిటి సంబంధం. ఇదీ అదీ ఒకటేనా లేక రెండూ విభిన్న తత్వాలా అనే సంశయం బాధిస్తుంటుందింకా సాధకుణ్ణి. అది నివృత్తి కావాలంటే శ్రవణం మాత్రం చాలదు. దాని తరువాత మనన మనే రెండవ ప్రక్రియ సాగించాలి. హేతు దృష్టాంతాలతో బాగా తర్కించి ఈ కార్యం ఆ కారణం కన్నా భిన్నం కాదు. భిన్నంగా భాసిస్తున్న దంత మాత్రమే. అంచేత అదే ఇది అని అభిన్నంగా పట్టుకొనే నిశ్చయ జ్ఞానం గడించాలి. ఈ నిశ్చయ జ్ఞానం వల్ల సంశయ పిశాచం తొలగిపోతుంది.
సంశయమంటే పోయింది నిశ్చయం కూడా కలిగింది కాని ఈ కలిగిన నిశ్చయ జ్ఞానం మనసులోనే నిలవటం లేదు లోక వ్యవహారంలో అడుగుపెట్టే సరికే ఎగిరి పోతున్నది. పోవటమే గాక ఆత్మ మరలా అనాత్మ రూపంగానే భాసిస్తున్నది. దీనికే విపర్యయమని పేరు. ఒక రకంగా కనిపించవలసింది ఉల్టా అయి ఇంకొక రకంగా కనిపిస్తే అది విపర్యయం Reverse.
Page 91