ఇంతకు ముందే వివరించారు గదా అంటే ఆది ఆచార్య హృదయాన్ని ముందుగా ఊహించి ఈ శిష్య పరమాణువు చేసిన వివరణ. ఇప్పుడాచార్యులవారు స్వయంగానే పలికిన మాట నాధారం చేసుకొని మరలా విచారణ సాగిస్తున్నాము. ఈ స్తోత్రంలో మేము సర్వాత్మ భావమనే గొప్ప రహస్యాన్ని సాధక లోకానికి ఎత స్ఫుటంగా బోధించాలో అంత స్ఫుటంగా నూ బోధ చేశాము. ఆచార్యుడుగా మా వంతు ఇంతటితో ముగిసిపోయింది. కాని అంతేవాసులుగా మీ బాధ్యత మాత్రమింకా ముగియ లేదు. మా బోధ బాగా మనసుకు పట్టించుకొని మా అనుభూతి లాంటి అనుభూతి మీరూ అపరోక్షంగా పొంద గలిగినప్పుడే అది మీ సొమ్మయ్యేది.
అది ఎలాగని మన మడిగితే చెబుతున్నారాయన ""తేనాస్య శ్రవణాత్తదర్ధ మననాద్ధ్యానాచ్ఛ సంకీర్తనాత్"" శ్రవణ మనన నిదిధ్యాసలని మూడు మజిలీలున్నాయి సాధన మార్గంలో శాస్త్రమూ దాని ననుభవానికి తెచ్చుకొన్న ఆచార్యుడూ చేసిన బోధను ముందు శ్రద్ధా భక్తులతో ఆలకించాలి శిష్యుడు. అందులోనూ పదార్థ శ్రవణమనీ వాక్యార్థ శ్రవణమనీ రెండున్నాయి తత్త్వమసిలో. తత్తంటే ఏమని అర్థం. త్వమ్మంటే ఏమిటర్ధం. అది వాచార్యర్థమా లక్ష్యార్ధమా ఏది గ్రహించాలి, ఏది వదిలేయాలి. ఇలాటి వివేచన పదార్థ శ్రవణం. పోతే అవి రెండూ కలిసి మరలా ఏ ఒకే ఒక అర్థం చెబుతున్నాయో అది అఖండ రూపమైన వాక్యార్థం దానిని గ్రహిస్తే అది వాక్యార్థ శ్రవణం అసి అనే మూడవ మాట దానినే సూచిస్తుంది.
Page 90