#


Index

  ఇది వాచ్యార్థం. కాని ఇక్కడ వాచ్యార్థాన్ని మాత్రం చెబితే కుదరదు. ఎందుకంటే పంచ భూతాలంటేనే చాలు. సూర్యచంద్రులు కూడా కలిసి వస్తారందులో మరి పురుషుడి శరీరం కూడా అందులోనే కలిపి వస్తుంది. అలాంటప్పుడు ఈ మూడింటిని మాత్రం ప్రత్యేకించి ఎందుకు చెప్పి నట్టాచార్యుల వారు.

  ఆయన ఉద్ధేశించిన అర్థం వేరు అది వాచ్యార్థం Primary కాదు. లక్ష్యార్థం Metaphorical దానిని బట్టి ఆలోచిస్తే వీటి మూడింటికీ వరుసగా మనో బుద్ధ్యహం కారాలని అర్థం చెప్పుకోవలసి ఉంటుంది. గీతాశ్లోకంతో పోల్చి చూచినా ఈ సంకేతార్థమే సరిపోతుంది మనకు. అక్కడ కూడా అష్ట విధమైన ఈశ్వర ప్రకృతిని వర్ణిస్తూ "భూమి రాపోనలో వాయుః ఖమ్ మనో బుద్ధిరేవచ అహంకారః” అని పరిగణించాడు వ్యాస భగవానుడు. ఇందులో భూమి నుండి ఖం వరకు పంచ భూతాలని తెలిసిపోతున్నది. పోతే మనో బుద్ధ్య హంకారాలనే మూడూ ఇక్కడ సాంకేతికమైన భాషలో గాక మామూలు భాషలోనే పేర్కొనటం జరిగింది. అవే ఇక్కడ స్తోత్రంలో సంకేత భాషలో వర్ణించారాచార్యుల వారని సులభంగా గ్రహించవచ్చు మనం.

  ఇంతకూ పృధివ్యాధులైన పంచభూతాలూ బాహ్య ప్రకృతి అయితే మనో బుద్ధ్యహంకారాలనేవి మూడూ మానవుడి అంతః ప్రకృతి వెరసి వీటి ఎనిమిదింటికీ అష్ట మూర్తులని పేరు. ఈ అష్టమూర్త్యాత్మకమే మనకు కనిపించే ఈ సమస్త సృష్టి ఇంతకు మించి విశ్వమంటూ మరేదీ లేదు.

Page 83