అలాగే “శిష్యాచార్యతయా” ఊరక మనకు దక్కింది. అనుభవిస్తూ కాలక్షేపం చేయటమే కాదు. మనస్సుకు రెండు గుణాలున్నాయి. ఒకటి తనకు ప్రాప్తమైంది మంచో చెడో అనుభవించటమూ మరొకటి అంతకు ముందు తనకు తెలియని విషయాల నంత కంతకు తెలుసుకొంటూ పోవటమూ. అయితే అలా తెలుసుకోవాలంటే అది ముందే తెలిసిన అనుభవజ్ఞుడొకడు చేయూతనివ్వాలి. అతడే ఆచార్యుడు "ఆచరతి ఆచారయతీ త్యాచార్య!" ఒకటి తాను గ్రహించి అది మరొకరి కందజేయగలవాడే ఆచార్యుడు అతడందిస్తే అందుకో గలవాడే శిష్యుడు ఈ శైష్యోపాధ్యాయిక వల్లనే లోకంలో విజ్ఞాన జ్యోతి అరకుండా కలకాల మపారమైన వెలుగు నిస్తూ పోతూంది మానవజాతికి కాబట్టి ఈ సంబంధమూ అనివార్యమే.
పోతే “పితృ పుత్రాద్యాత్మనా” పితృ పుత్రాదికమైన సంబంధాలింకా ఎన్నో ఉన్నాయి. శిష్యాచార్యులెలా వచ్చారసలు పితాపుత్ర సంబంధమనేది ఒకటి ఉంటేనే గదా. శిష్యుడైనా మొదట ఒక తండ్రికి జన్మించ వలసిందే. ఆచార్యుడైనా జన్మించవలసిందే. అలా జన్మించి వారు మరలా ఇంకొక శిష్యాచార్యులకు తండ్రులవు తున్నారు. ఒకరికి తనయులు, మరొకరికి తండ్రులు. మానవులంతా అసలీ లోకంలో జన్మించారంటే ఈ జన్మ జనక సంబంధం వల్లనే కదా జన్మిస్తున్నారు. ఆ తరువాతనే మిగతా సంబంధాలన్నీ ఏర్పడుతున్నాయి వారికి. ఇది కూడా ఆ మాటకు వస్తే మొదలు చెప్పిన కార్య కారణ సంబంధం కన్నా వేరు గాదు. తండ్రి కారణమైతే కొడుకు కార్యం.
Page 75