ఏమిసుఖం అసలైన ఆత్మ మూడు దశలలోనూ మన కింతవరకూ అనుభవానికి రానేలేదన్న మాట.
ఈ రాక పోవటమే సమస్య. రానందు వల్లనే అనాత్మ రూపమైన సంసార బంధం మనకు తొలగటం లేదు. ఇందులో ఆవరణాత్మక రూపమైన మాయ నుషుప్తిలోనూ విక్షేపాత్మకమైనది జాగ్రత్స్వప్నాలలోనూ రాజ్యం చేస్తున్నాయని గదా చెప్పాము. ఈ ఆవరణ విక్షేపాలనే మరొక భాషలో పేర్కొన్నారు భగవత్పాదులు. ఆరవ శ్లోకంలో సుషుప్తిని వర్ణిస్తూ మాయా సమాచ్చాదనాత్తనే మాటలో ఆవరణాన్ని సూచించారు. పోతే ప్రస్తుత మీ ఎనిమిదవ శ్లోకంలో జాగ్రత్స్వప్నాలను వర్ణిస్తూ మాయా పరిభ్రామితః అని రెండవదైన విక్షేపాన్ని నిర్ధేశిస్తున్నారు. ఆచ్ఛాదన మన్నా ఆవరణమన్నా ఒకటే. అలాగే విక్షేపమూ పరిభ్రమణమూ ఒకటే. పరిభ్రామితః అంటే పరిభ్రమింప జేయబడ్డవాడు ఎవడు వాడు ఈ జీవుడే.
ఆవరణ మెప్పుడాచ్ఛాదనం చేసిందో అప్పుడనంతమైన చైతన్యమక్కడికి అంతమై జీవ భావమేర్పడింది. జీవుడేర్పడే సరికి జీవుడి దృష్టిని విక్షేప మనే ముఖంతో పరిభ్రమింప జేసిందా శక్తి. దానితో రెండు చేతులు పట్టుకొని చుట్టూ గిరగిర త్రిప్పి పడవైచిన కుర్ర వాడికెలా కళ్లు తిరిగి ఒకదానికొకటి తల్లక్రిందులుగా కనిపిస్తుందో - అలాగే ఏదేదో విపరీతంగా కనిపిస్తున్నదీ జీవుడికి. జాగ్రత్స్వప్నాలు రెండు దశల్లో మన బహిరంత రింద్రియాలకు గోచరించే దంతా ఇలాటి ప్రపంచమే. ఒక ఇంద్రజాల మహేంద్రజాలం లాగా కనిపిస్తున్నదీ త్రి
Page 74