#


Index

  అందుకే “ఆచార్యవాన్ పురుషోవేద” అన్నారు. తత్త్వమసి అనే మహా వాక్యం అనుభవజ్ఞుడైన "ఆచార్యుడుపదేశిస్తే” దాన్ని శ్రవణ మననాదులు చేయటం వల్ల అలాటి అనుభవమే ఏర్పడుతుంది మరలా సాధకుడికి. అప్పుడంత వరకూ అతడిలో నిద్రాణమై ఉన్న అఖండాత్మ జ్ఞాన మొక్కసారిగా ఉద్భుద్దమవుతుంది. "ప్రకటీకరోతి భజతాంయో ముద్రయో భద్రయా” అలాటి అఖండాత్మ భావాన్ని మనమెన్ని జన్మల నుంచో మరచి పోయిన దాన్ని మరలా మనకు ప్రకటం చేయటానికే ఆచార్యుడనే వాడు లోకంలో అవతరించాడు. అతడు తన్ను భజించే అంతే వాసులందరికీ ప్రకటం చేస్తాడు. ఏమిట. స్వాత్మానం అసలైన ఆత్మ తత్త్వాన్ని ఎలా చేస్తాడా ప్రకటన ముద్రయా భద్రయా భద్రమైన ముద్రచేత.

  ముద్ర అంటే ఒక సంకేతం. బాహ్యానికి ప్రదర్శించి చూపేది. తన్మూలంగా అంతరమైన సత్యాన్ని బోధపరుచుకోవాలి సాధకుడు. లేకుంటే సంకేతం మాత్రం మిగిలిపోయి సత్యం మనకు దూరమవుతుంది. అది మొదలు చెడ్డబేరం అంచేత ముద్రలనే వన్నీ ఒక సత్యానికి కేవలం ప్రతీకలని Indicatives భావించి తద్వారా ఆ సత్యాన్ని పట్టుకొని వాటిని వదిలేయాలి మనం. ఖేచరీ భూచరీ వగైరా ముద్రలన్నీ ఇలాటివే. అయితే ఈ ముద్రలన్నీ భద్రమైనవి కావు. అంటే ప్రేయస్సే Prosperity శ్రేయస్సును Peace ప్రసాదించనివి మనకు శ్రేయస్సనేది మోక్షమొక్కటే. దానిని మనకు ప్రసాదించే ముద్ర ఒక్కటే ఒకటుంది. అదే చిన్ముద్ర.

Page 71