పైగా జ్ఞానాని కదనంగా ఉపాసనా మార్గ మాయన లోకాని కదే పనిగా బోధించనక్కరలేదు. అది పూర్వ మీమాంసకు లెలాగూ నిరూపణ చేసారు. కృతస్య కరణ మన్నట్టు చేసిందే చేయటం దేనికి మరోలా. అంతవరకూ శాస్త్రకారుల లోకంలో ఎవరూ స్పృశించనిది - స్పృశించి లోకానికుపదేశిస్తే జన్మతారకమైనది ఏదో - అదే బోధించారాయన జగద్గురువుగా. నూటికి నూరుపాళ్ళూ అలాగే బోధ చేస్తూ వచ్చారాయన. అది మనకాయన రచనలన్నిటిలో ప్రత్యక్షరమూ తార్కాణమయ్యే లక్షణం.
దీనిని బట్టి మన మీ మకుట పాదానికి జ్ఞానపరంగా అర్థం చెప్పాలేగాని ఉపాసనా పరంగా కాదు. దక్షిణామూర్తికి నమస్కారం అంటే ఆ దక్షిణామూర్తి ఎవరో కాదు, గురుమూర్తి! ఆ గురుమూర్తి మరలా ఎవరో కాదు. తస్మై, అంటే ఈ నమస్కరించే శిష్యపరమాణువే. అప్పటికి నమస్కర్తా - నమస్కార్యుడూ - ఇద్దరూ ఒకటే. పైకి భిన్నంగా కనిపిస్తున్నారంత మాత్రమే గాని చైతన్యరూపంగా అందరూ ఒకే ఒక తత్త్వం. ఇదే సర్వాత్మ భావం. ఈ సర్వాత్మ భావాన్ని బయటపెట్టటమే ఆచార్యులవారి సంకల్పం. కనుకనే సర్వాత్మత్వ మితి స్ఫుటీకృత మని చివర ఫలశ్రుతి శ్లోకంలో కంఠోక్తిగానే చాటి చెప్పారాయన. ఆయన హృదయాన్ని గ్రహించిన ఆయన శిష్యుడు సురేశ్వరుడు కూడా గ్రంథారంభంలో ఈ రహస్యాన్నే వాక్రుచ్ఛాడు- “ఈశ్వరో గురురాత్మేతి మూర్తిత్రయ విభాగినే” అని. ఇక సందేహమేముంది మనకు?
కాగా ఈ దక్షిణామూర్తి ఎవరనేదే ఇప్పుడు ప్రశ్న. దక్షిణామూర్తి అంటే అది శివుడు విష్ణువులాగా ఒక మూర్తి అని గాదు మనమర్ధం చేసుకోవలసింది,
Page 6