వటవృక్షం క్రింద ఆసీనుడై చుట్టూ చేరిన వసిష్ఠాది మహామునులకు చిన్ముద్రతో మొదట బోధించాడాయన ఈ తత్త్వం “సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్”. తన్నా శ్రయించిన వసిష్ఠాదు లందరికీ ఆ మహావాక్యాన్నే బోధించిందాయన. అదే తరువాత లోకంలో గురుశిష్య సంప్రదాయంగా చెలామణి అయింది. గురుస్సాక్షాత్పరం బ్రహ్మ అన్నారు. శ్రోత్రియుడూ బ్రహ్మ నిష్టుడూ అయిన ఆచార్యుడు బ్రహ్మం కాక మరెవరు కనుక పరుసవేది సోకితే ఇనుము బంగారమయినట్టు అనుభవజ్ఞుడైన ఆచార్యుడి బోధనతో ఆశ్రితులైన శిష్యులు కూడా బ్రహ్మానుభవం పొందటంలో ఆశ్చర్యం లేదు. పొందితే “నపునరా వృత్తిర్భ వాంభోనిధౌ” మరలా ఇక సంసార సాగర గర్భంలో వచ్చిపడే ప్రమాదమూ లేదు.
4
మన శరీరంలో ఉండే జీవ చైతన్యమూ విశ్వవ్యాప్తమైన ఈశ్వర చైతన్యమూ ఒక్కటేనని ప్రతిపాదించాము. అదే "తత్త్వమసి" వాక్యం బోధించే సత్యమని కూడా పేర్కొన్నాము. బాగానే ఉంది కాని త్వంపదార్థమైన చైతన్య మొకటి శరీరంలో మొదట ఉంటే గదా అది తత్పదార్థమైన ఈశ్వరుడేనని మనం చాటగలిగేది.
Page 37