కేవలం సచ్చిదాత్మకం గానే ఉందని అర్థం చేసుకోవాలి మనం. అలా చేసుకోగలిగితే ఇక చైతన్య రూపమైన ఆత్మ తత్త్వమొక్కటే అద్వితీయంగా ఉంది. ఇంకొక ద్వితీయ పదార్థమే లేదని నిర్ధారణ అవుతుంది.
ఎప్పుడైతే ఆత్మ భిన్నమైన దేదీ లేదని నిర్ధారణ అయిందో అప్పుడిక అంతర్గతం. బహిర్గత మనే చింత లేకుండా మొత్తం ప్రపంచమే ఎగిరిపోయింది. దానితో ఈ మన దేహమూ, ప్రాణమూ మనోవృత్తులూ ఈ ఉపాధులకు Accidents కూడా తిలాంజలి ఇచ్చినట్టయింది. ఉపాధుల వల్లనే గదా మనం జీవులమయ్యాము. అవి తొలగి ఎప్పుడు మన జీవ చైతన్యం విస్తరించి వ్యాపించిందో అప్పుడది ఇక జీవుడు కాదు. ఈశ్వరుడే. ఎందుకంటే ఈశ్వరుడంటే నిరుపాధికమైన చైతన్యమే. మరేదీ గాదు. జీవుడలాంటి నిరుపాధికమైన చైతన్యమే అయ్యాడు. ప్రస్తుతం. రెండు నిరుపాధికమైన తత్త్వాలుండటానికి వీలులేదు. రెండాకాశాలుండగలవా? అలాగే రెండు చైతన్యాలుండలేవు. ఉండకపోతే అవి రెండు కావిక. రెండూ కలిసి ఒక్కటే అవుతాయి. అది అంటే ఈశ్వరుడు. జీవుడనే వాడు వాస్తవంలో ఈశ్వరుడే. అంతకంటే వేరు కాడని భావం. అయితే వేరు కానపుడు వేరుకావని చెప్పటం దేనికి? వేరని భావిస్తున్నాము గనుక. మనలో ఇప్పుడెవరికి గాని నేనీశ్వరుడననే జ్ఞానం లేదు. ప్రతి ఒక్కడూ తాను జీవుడేనని భ్రమిస్తున్నాడు. ఎందుకు కలిగింది ఈ జీవ భావన? శరీరమూ ప్రాణమూ - మనస్సూ - ఇంద్రియాలు - ఈ సంఘాతమే Constitution నేనని, దీనితో తాదాత్మ్యం Identity చెందాము.
Page 34