#


అద్వైత వేదాంత ప్రవచనములు



గమనించండి:- అద్వైత సద్గురువు బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు మొదట ఉపనిషత్తులతో తమ బోధనలు మొదలు పెట్టారు. దశోపనిషత్తులును, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత (ప్రస్థానత్రయ) ప్రవచనాలు తరువాతే వేదాంత పంచదశి, మానసోల్లాసము, త్రిపురా రహస్యము, సనత్సుజాతీయము పక్షపాత రహిత అనుభవ ప్రకాశ వంటి అనేక ప్రవచనాలు శిష్యులకు భోధించారు. ఉపనిషత్తులు శ్రవణం చేయకుండా బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వేదాంత పంచదశి, మానసోల్లాసము, త్రిపురా రహస్యము, సనత్సుజాతీయము పక్షపాత రహిత అనుభవ ప్రకాశ వంటి ప్రవచనాలు శ్రవణం చేయటం పునాది లేకుండా బిల్డింగ్ కట్టటం లాంటిది. ఎక్కువ మంది ఉపనిషత్తులు శ్రవణం చేయటానికి ఇష్ట పడటం లేదు. దశోపనిషత్తుల సారాంశం వింటున్నాము సరిపోతుంది బ్రహ్మసూత్రాలు, భగవద్గీత కావాలంటున్నారు, ప్రస్తానత్రయ ప్రవచనాలు అవకాశం ఉండి కూడా శ్రవణం చేయలేనివారు దురదృష్టవంతులు. అద్వైత వేదాంతాన్ని కొత్తగా శ్రవణం చేసే సాధకులు ఉపనిషత్తులు నుండి శ్రవణం మొదలుపెట్టండి గురువు గారు అలానే బోధించారు.