వీటి రెండింటినీ క్రమంగా దాటిపోయి దాన్ని వాటేసుకోవాలి మానవుడెప్పటికైనా. అదే పురుషోత్తమ ప్రాప్తి. దానికి సమ్మోహ Illusion మడ్డు పడుతుంటుంది. జ్ఞాన చక్షుస్సుతో ఆ చీకటిని చీల్చుకొని ముందుకు సాగిపోవాలి.
అలా పోవాలంటే ఆధ్యాత్మికాధి భౌతికాధి దైవిక సృష్టి అనే మూడింటిలో ఒకే ఒక ఆత్మజ్యోతిని దర్శిస్తూ ఉండాలి. మమైవాంశో జీవలోకే. ఆ పరమాత్మ అంశే వాస్తవానికీ జీవాత్మ. కనుక ఈ శరీరాద్యుపాధుల మేరకే ఉన్నా నను కోక సర్వత్ర సచ్చిద్రూపంగా నేనే వ్యాపించి ఉన్నానని తన వ్యాప్తిని తాను గుర్తు చేసుకోవాలి. అలాటి దివ్య దృష్టి అలవడితే సృష్టి అంతా తానే అయినట్టు తన స్వరూపంగానే గుర్తించి తరించగలడు.
దైవాసుర సంపద్విభాగం
అలా దర్శించటాని కధికార సంపత్తి ఉండాలి మానవుడికి. లోకంలో మానవులందరూ రెండు జాతులు. కొందరు దైవ గుణాలు గలవారు. మరికొంద రసుర గుణాలున్న వారు. దైవ సంపన్నులు చాలా వరకు సాత్త్విక స్వభావులయి ఉంటారు. అసుర గుణసంపన్నులు రాజస తామస స్వభావులు. ఇందులో దైవసంపద అనేది మానవుణ్ణి బంధం నుంచి తప్పిస్తుంది. అసుర సంపద అంతకంతకు సంసార బంధంలో పడదోస్తుంది. అసుర సంపద అంటే
Page 60