#


Index

ప్రస్థానత్రయ సారము

రజస్తమో గుణాల విజృంభణమే. అలాటివారికి అహంకార బల దర్పాది అవలక్షణాలెన్ని ఉండాలో అన్నీ ఉంటాయి. దానితో కన్నుగానక బ్రతుకుతుంటారు వారు. చివరకు వారికి ప్రాప్తించేది నరకమే.

  త్రివిధం నరకస్యేదం ద్వారం- కామం క్రోధం లోభమనేని మూడూ మూడు ప్రకృతి గుణాలకు ప్రతీకలు. వాటి వలలో బడితే చాలు. అవి సరాసరి నరకానికే చేరుస్తాయి. ఆ తరువాత అసుర యోనులలో జన్మిస్తారలాటి వారు. ఏ జన్మకూ భగవత్రాప్తి లేదు వారికి. పునరపి జనన మన్నట్లు జనన మరణ పరంపర అనుభవిస్తూనే పోతారు.

  మరి దైవగుణ సంపన్నులయితే శాస్త్రోక్తమైన మార్గంలో జీవితం సాగిస్తూ చివరకు భగవత్స్వరూప చింతనతో జన్మరాహిత్యం చేసుకొని క్రమంగా ముక్తులయి పోగలరు. శాస్త్రాన్ని వదిలేసి తమ ఇష్టానుసారం బ్రతికితే ఇహంలో సుఖం లేదు. పరంలో శాంతి లేదు. అలా కాక శాస్త్రీయమైన మార్గంలో పయనించేవారు ఏది కర్తవ్యమో గుర్తించి అదే ఆచరించి దానికి తగిన సిద్ధి పొంది తీరుతారు.

శ్రద్ధాత్రయం

  దేనికైనా శ్రద్ధ అనేది ఉండాలి మానవుడికి. శ్రద్ధామయోయం పురుషః యోయచ్ఛన్స ఏవసః - శ్రద్ధే మానవుడంటే. ఎముకలు కండలు రక్తం మాంసం కాదు.

Page 61

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు