జ్ఞాని అయితే సగుణమైన ఈ రెండింటి ద్వారా నిర్గుణాన్ని అందుకొని ఆ భావనలో దీన్ని ప్రవిలయం చేసుకొంటాడు.
ఇలాంటి అద్వైత భావనతోనే ఎప్పటికైనా మనమా పరతత్త్వాన్ని
అందుకొని తరించవలసి ఉంది. సగుణోపాసకుడు కూడా చివరికీ
నిర్గుణమైన జ్ఞానంద్వారా గాని ముక్తి పొందలేడు. కనుకనే లలితా,
విష్ణు అని సహస్రనామాలు చెబుతున్నా ఇన్ని నామాలూ, ఇన్ని
రూపాలు ఉన్నాయనిగాదు వ్యాసహృదయం. వీటన్నింటినీ అనామక
మరూపకమైన పరమాత్మ చైతన్యంలో లయం చేసి దానినీ
సాధకుడాత్మ చైతన్యంతో అభిన్నంగా భావించాలని. అందుకేనేమో
సగుణనామాలతోపాటు నిర్గుణ నామాలు కూడా జతచేసి వర్ణిస్తూ
పోతాడు రెండు స్తోత్రాలలో ఎన్నో నామాలు రెండింటిలో
ఏకరూపంగా కూడా కనిపిస్తాయి. శుద్ధ, సులభ, ముక్త, పరాయణ,
ఇలాంటివి కుప్పతెప్పలు. దీనిమూలంగా లలితా-విష్ణు అని స్త్రీ
పుంసభేదమా తత్త్వంలో చూడరాదని చాటుతున్నాడు మహర్షి.
అంతేకాదు బ్రహ్మరూపా
గోవిందరూపిణి ఇత్యాదిగా దేవిని
శర్వ-శివ అజ బ్రహ్మ-కేశవ విష్ణు అని దేవుని వర్ణించటాన్ని బట్టి
త్రిమూర్తి భేదం కూడా చూడరాదని చాటినట్టయింది. మరి ఆత్మా
అనే నామం రెండింటిలో పేర్కొనటాన్ని బట్టి చూస్తే
నామలింగరూపభేద రహితమే గాదు. వస్తుతః అది ఈ సాధకుడి
స్వరూపమేనని
కూడా ఒక గొప్ప రహస్యాన్ని
బయటపెడుతున్నాడాయన. చివరకు లలితా విష్ణు అనే మాటలకు
కూడా అర్థం శివపత్ని పార్వతి-లక్ష్మీపతి విష్ణువని కాదు.
Page 4