#


Index

ప్రస్థానత్రయ సారము

చివర కవసానంలో ఆ భావమే మనసులో నిలిచి సాధకుడు తన ప్రాణశక్తిని సూర్యశక్తిలో ప్రవేశపెట్టి దాన్ని కూడా భేదించుకొని సత్యలోకం దాకా ప్రయాణం చేస్తాడు. అక్కడ నిర్గుణ ధ్యానం చేసే చతుర్ముఖ బ్రహ్మ ఆయన చుట్టూ ఉన్న వసిష్ఠాది మహర్షులతో పాటు తానూ ఆ శిక్షణ పొంది చివరకు నిరాకారమైన ఆ తత్త్వాన్ని తన స్వరూపంగా భావన చేసి తరించగలడు. ఇదీ ఈశావాస్యం మనకు చేసే బోధ.

  ఇందులో రెండు భాగాలున్నాయి. ఉత్తమాధికారి అయితే ఇహంలోనే అంతా నిర్గుణమైన తత్త్వమేనని స్వానుభవానికి తెచ్చుకొని ఇక్కడే ముక్తుడవుతాడు. మధ్యమాధికారి Mediocre అయితే జీవితాంతమూ సగుణంగా ధ్యానించి మరణానంతరం ధ్యానబలంతో పరలోకానికి వెళ్లి అక్కడ నిర్గుణ జ్ఞాన మలవరుచుకొని తరిస్తాడు. మొదటిది సద్యోముక్తి. రెండవది క్రమముక్తి.

కేనోపనిషత్తు

  అయితే ఈ సాకారమైన ప్రపంచమే గదా మనకు కనిపిస్తున్నది. దీనికి వెనకాల ఒక నిరాకారమైన ఈశ్వర చైతన్యమున్నదా అని సందేహం. ఉన్నదని గట్టిగా చెబుతున్నది కేనోపనిషత్తు.

Page 9

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు