ఈశా వాస్యం
ఉననిషత్తులు ప్రధానమైనవి పది అని పేర్కొన్నాము.
ఈ పదింటిలో మొదటిది ఈశావాస్యం. ఈశావాస్యమిదగ్ం
సర్వం. ఈ ప్రపంచమంతా ఈశ్వర చైతన్యంతో నిండి
పోయిందని చాటుతున్నదీ ఉపనిషత్తు. అందుకే ఆపేరు
వచ్చింది దీనికి. వాస్తవంగా ఇది పరమాత్మ స్వరూపమే
అయినా అలా కనపడటం లేదీ ప్రపంచం. నామ
రూపాత్మకంగా కనిపిస్తున్నది. అలా కనిపిస్తున్నంత వరకూ
దీనివల్ల బాధలు తప్పవు. అంచేత ప్రతి ఒక్కటీ కేవల
మున్నదనే స్ఫురణే తప్ప మరే విశేషమూ లేదనే దృష్టి
అలవరుచు కోవాలి మనం. ఎక్కడ ఉందా స్ఫురణ.
తదంతరస్య. ఎక్కడా అనే ప్రశ్నే లేదు. ప్రతి దాని లోపలా
వెలపలా సొమ్ములలో బంగారంలాగా వ్యాపించి ఉంది.
బంగారమనే దృష్టి వదలకుండా ఆభరణాలు చూచినట్టే ఈశ్వర
చైతన్య దృష్టితో చూడాలి ప్రతి ఒక్కటీ.
అయితే అలాటి జ్ఞానం పెట్టుకొని కూచుంటే దినచర్య ఎలా చేయాలి మనం. పరవాలేదు. ఏవంత్వయి. మనో వాక్కాయాలతో ఏ పనిచేస్తున్నా దృష్టి పెట్టుకొనే చేయవచ్చు.
Page 7