చివరి మాట
ఇలాగా జీవిత సమస్యను అవలీలగా పరిష్కరిస్తున్నది గీత. అయితే ఇది కేవలం వస్తుసిద్ధమనే మాట మరచిపోరాదు మానవుడు. వస్తువెప్పుడూ పరోక్షం మనకు. అది మనకు బుద్ధి సిద్ధమైతేనే అనుభవం. విమృశ్యైత దశేషేణ దాన్ని బాగా నీ మనస్సులో విమర్శించి పరోక్షంగా శ్రవణం చేసిన సత్యాన్ని అపరోక్షంగా Direct అనుభవానికి తెచ్చుకో. అప్పుడే నీ సమస్యకు పరిష్కార మంటున్నది గీత. సమస్య బాహ్య ప్రపంచం వల్ల ఏర్పడినా అది నీ మనస్సుకు వచ్చినప్పుడే గదా ఇది నాకు సమస్య అనే అనుభవం నీకు కలుగుతున్నది. అలాగే పరిష్కారం కూడా బాహ్యంగా కేవలం వింటే కాదు. అది కూడా మనసుకు తెచ్చుకొని పదే పదే భావన చేయాలి. ఆ భావనే మన కను భవమిస్తుంది. ఇప్పుడీ లోకానుభవం కూడా శారీరకం కాదు. మానసికమే బాగా ఆలోచిస్తే. లోకానుభవమే మానసికమయి నప్పుడు మోక్షానుభవం
Page 66