ఒక అర్జునుడికే గాదు మనందరికీ జీవితంలో నిత్యమూ ఎదురయ్యే సమస్యే ఇది. ఈ విష వలయంలో చిక్కి సతమతమవు తుంటాడు నరుడు. వాడెంత కోటీశ్వరుడైనా ఎంతనిష్ఠ దరిద్రుడైనా -ఎలాటి మేధావంతుడైనా - ఏమాత్రం తెలివిలేని మూఢుడైనా తప్పదీ విషాదయోగం.
సాంఖ్యయోగం
మరేమిటి దీనికి పరిష్కారం. చికిత్స చేసే ముందు వ్యాధి ఏమిటో అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. వ్యాధి విషాదం. అది దేహాత్మాభిమాన రూపమైన అహం కారం వల్ల వచ్చిందని తెలిసిపోయింది. పోతే దీని నెలా పరిష్కరించుకోవాలి. సాంఖ్యమే పరిష్కారం. సాంఖ్యమంటే వేరు చేసి చూడటం. ఆత్మ అనాత్మ రెండూ కలిసి కలగా పులగమయి ఉన్నాయి. శరీరానికి వేరుగా ఉంది మన ఆత్మ. అది శుద్ధ చైతన్యం. ఇది జడమీ శరీరం. సంబంధం లేదు. అయినా ఈ దేహమే నా స్వరూపమని భ్రమ పడుతున్నాము. అందుకే ఇది జన్మిస్తే నేను జన్మించానని - ఇది మరణిస్తే నేనే మరణిస్తున్నానని దీని లక్షణాలు నామీద ఆరోపించు కొన్నాను.
Page 38