భగవద్గీత
ఉపనిషత్తులూ బ్రహ్మ సూత్రాలూ రెండూ చెప్పు కొన్నాము. ఒకటి శ్రవణ ప్రధానమైతే ఇంకొకటి మనన ప్రధానమని కూడా పేర్కొన్నాము. ఆ రెండింటి సారమేదో గ్రహించాము. పోతే ఆ శ్రవణమైన మనవమైన జ్ఞానాన్ని దినచర్యలో స్వానుభవానికి తెచ్చుకొనే మార్గమేదో అది ఆలోచించాలి. అలా తెచ్చుకోటానికే నిది ధ్యాస అని పేరు. దాన్ని మనకు బోధించటానికే వచ్చింది భగవద్గీత లోకంలోకి. ఇది 18 అధ్యాయాల గ్రంధం. అందులో మొదటిది సమస్యను చెబుతుంది. అదే విషాద యోగం. చివరిది దానికి పరిష్కారం తెలుపుతుంది. అది మోక్ష సన్న్యాసం. పోతే మధ్యలో ఉన్న పదహారూ రకరకాలుగా ఆ మార్గాన్ని చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తాయి. క్రమంగా తెలుసుకొందాము.
విషాదయోగం
కురుక్షేత్రమేదో గాదు. సంసారం. రథం మనశరీరమే. ఇందులో కూచున్న జీవుడే అర్జునుడు. నరుడని కూడా అర్జునుడికి పేరు. పోతే సారథి కృష్ణుడు మన బుద్ధి. జీవితమే సంగ్రామం. ఇందులో అనుకూల ప్రతికూల పరిస్థితులే పాండవ కౌరవ సేనలు. మనబోటి జీవులే చేయాలీ యుద్ధం.
Page 36