ఫలాధ్యాయం
సాధన అయిన తరువాత చివరగా చెప్పుకోవలసింది ఫలం. ఫలమనేది మోక్షమే. మోక్షమంటే విడుదల. శరీరమూ ప్రపంచమూ ఇవి రెండే గదా బంధం మనకు. వీటివల్లనే గదా సమస్య. ఇవి రెండూ ఆభాస అని తేల్చుకున్న తరువాత ఇక తాను కర్త కాడీ జీవుడు. కర్త కాకుంటే భోక్తా కాదు. కేవలం సాక్షిగా మిగిలిపోతాడు. కర్మఫలమైన సుఖదుఃఖాదు లేవీ లేవు కాబట్టి నిత్యమూ సుఖమే. తన చైతన్య స్వరూపమే తనకెప్పుడూ ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తుంది. అంతా ఆత్మే అనాత్మ లేదు. ఈ ఏకాత్మ భావమే మోక్షం. ఏది చూచినా ఏది చేసినా ఏది ఆలోచించినా తానే తనలో అద్దంలో ముఖంలాగా తనకు తానే ఉన్నాననే ప్రజ్ఞతో ఉంటాడు. సుఖదుఃఖాలూ జనన మరణాలూ కూడా తన స్వరూపమే. అప్పుడిక మరణమనే భయం కూడా ఎగిరిపోతుంది. మరణమంటే మరణించేవాడూ మరణమూ వేరుగా ఉన్నప్పుడే గదా. అంతా నిరాకారమైన ఆత్మే అయినప్పుడిక మరణమెక్కడిది. అయితే మరణమెవరికి. శరీరానికి తనకు గాదు. చైతన్యంగా మరణంచడు. దాని
Page 34