ముందుమాట
మానవ జీవితానికి పట్టుకొన్న ఒకే ఒక సమస్య విషాదం. దాన్ని పోగొట్టుకొనే మార్గమేమిటా అని చాలా దూర మాలోచించారు మన పెద్దలు. వారే మహర్షులు. వారు ధ్యానంలో కూచొని దర్శించిన సత్యమే ఉపనిషత్తుల రూపంగా వెలువడింది. ఈశావాస్యం మొదలు బృహదారణ్యకం వరకూ పది ఉపనిషత్తుల సారమూ అదే. అది ఉన్నదున్నట్లు ఆకళించు కోలేక వాదోపవాదాలు బయలుదేరితే వాటిని సమన్వయించి చూపాడు మరలా బాదరాయణుడనే ఆచార్యుడు. ఆయన రచించినవే బ్రహ్మ సూత్రాలు. ఉపనిషత్తుల మీద సాగించిన విచారణ కాబట్టి దీనికి వేదాంత మీమాంస అని కూడా పేరు. ఈ రెండింటి మూలంగా మానవుడు గ్రహించిన సిద్ధాంతాన్ని తన దినచర్యలో దృష్టాంతం చేసుకోవాలంటే అది చూపటానికి వచ్చింది భగవద్గీత.
Page 3