కఠోపనిషత్తు
మనసు బ్రహ్మాకార వృత్తితో నిండిపోతే చాలు. అవసానంలో ఆ మనసే బ్రహ్మాకారంగా మారి అమృతత్వమనే మోక్ష ఫలం లభిస్తుందని హామీ ఇచ్చింది కేనోపనిషత్తు. అమృతత్వమంటే మరణం లేక పోవటమే గదా. నిజంగానే మరణ మనేది లేకుండా పోతుందా అని మానవుడికి మరలా అనుమానం. ఈ అనుమానంతోనే నచికేతుడనే ఒక ముని కుమారుడు యమలోకం దాకా పోయి సాక్షాత్తూ యమధర్మరాజునే నిలదీసి అడిగాడు. యత్త్వం పశ్యసి తద్వద - నీవు నిజంగా చూచే చెబుతున్నావా అని అడుగుతాడు.
దానికి యముడు సమాధానమిస్తూ ఆత్మను దర్శించ గలిగితే అది సాధ్యమే నంటాడు. ఆత్మ అంటే ఏమిటి. అది ఎక్కడ ఉంది. సర్వేషు భూతేషు గూఢః - ప్రపంచమంతా వ్యాపించి ఉంది. కాని గుప్తంగా ఉంది. మరి ఎలా పట్టుకోటం. బుద్ధి బాగా పదునెక్కితే అదే పట్టుకోగలదా తత్త్వాన్ని. అప్పుడు తమలపాకు నుంచి దాని ఈనె బయటికి లాగినట్టు ఈ నామరూప ప్రపంచం నుంచి వేరు చేసి
Page 13